ఇటీవల తెరాస నేత కె.సి.ఆర్. తెలంగాణాలో పుట్టిన వాళ్ళంతా తెలంగాణా వాళ్ళే అన్నదానిపై రాద్ధాంతం జరుగుతోంది. అయినా మన జన్మస్థల ధృవీకరణ పత్రం మనం పుట్టిన వూరి నుంచే కదా తీసుకుంటాం. మరి దీనిపై ఇంత గోల దేనికో?
ముల్కీ నిబంధనలను దొంగ సర్టిఫికేట్లతో వాడుకుంటారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ సర్టిఫికేట్లు ఇచ్చేది మరి ఆ ప్రాంత అధికారులే కదా? వాళ్ళకు చిత్తశుధ్ధి లేదని అనుమానమా? దొంగ సర్టిఫికేట్ల సృష్టి ఎప్పుడూ వున్నదే. దానిని నిలువరించే కృషి వైపు ఆలోచించాలి కానీ ఆ ప్రాంతంలో పుట్టిన వాడికి అక్కడ నివాసముండే హక్కు లేదనడం ఫాసిజమే అవుతుంది కదా? అయినా దోచుకునే వాడికి కుల, మత, ప్రాంతీయ విభేదాలుంటాయా? ఆలోచించండి!
ఈ పాట విందాం..
నా జన్మభూమి
