మానవత్వం మంటగలిసిని వేళ.
రాను రాను దిగజారుతున్న మానవ సంబంధాల గురించి ఉలిక్కిపడకుండా వుండగలమా? ఒకడు తల్లిని చావుకు ముందే శ్మశానానికి తగిలేసాడని ఆ మధ్య చదివాం. ఎంతో మంది తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు తరిమేయడం చూస్తున్నాం. తల్లీ తండ్రి చేస్తున్న ఉద్యోగాలకోసం వారిని రిటైర్మెంటుకు ముందు రోజు చంపేసిన వారిని కొంతమందిని చూసాను. మీరూ చూసే వుంటారు? చాలామంది వృద్ధులు వసతి లేక, కన్నవారి కాఠిన్యానికి దూరమై రోడ్లపై అడుక్కోవడం చూస్తున్నాం. కానీ ఇది మరీ దారుణమైన వార్త. కన్నపేగులను తెంచి హారంగా చేసుకున్న వారసుల వార్త.
ఆస్తికోసం తల్లికి HIV రక్తం ఎక్కించిన కూతుళ్ళ గురించి ఇప్పుడే చదివాను. గుంటూరులో తల్లిపేరనున్న పది లక్షల ఆస్తికోసం ఆమెకు HIV రక్తం ఎక్కించారని అనారోగ్యానికి గురైన తల్లి తెలుసుకొని జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయడంతో ఈ వార్త బయటపడింది.
ఆమె మరణించేంతవరకు ఆగలేకపోయిన కూతుళ్ళు ఈ దారుణానికి ఒడిగట్టారంటే ఆస్తి – మమకారాన్ని, అనుబంధాలను ఎంతగా నాశనం చేస్తుందో వింటూంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. కన్నపేగుల తీపినెరుగని వారిగా తయారయిన ఈ వంశాంకురాల్ని కన్న ఆ తల్లి మనోవేదనకు కొలమానం వుంటుందా? వారి పిల్లలు వారినెలా చూస్తారోనన్న భయమైనా వుందా వీళ్ళకి?
వార్త ఆధారం http://thatstelugu.oneindia.in/news/2010/10/04/greedy-daughters-heinous-act-against-041010.html
Like this:
Be the first to like this post.