జనవరి ఐదు మీటింగునకు పార్టీలనుండి ఇద్దరేసి నాయకులను ఆహ్వానించడంలోనే కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత ధోరణి తెలుస్తోంది.
శ్రీక్రిష్ణ కమిటీ పేరుతో వచ్చిన బృందం అన్ని ప్రాంతాల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు కానీ ఎంచుకున్న ప్రాంతాలకే పరిమితమైపోయారు. ఈ బృందం ప్రచారానికిచ్చిన ప్రియారిటీ ప్రజల అభిప్రాయాలకిచ్చినట్లుగా లేదు. ఎప్పుడూ మీడియాముందు ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని ప్రస్తావిస్తూనే వచ్చారు. ఇందులో దుగ్గల్ చాలా ముందున్నారు. ఇంతవరకు ఏర్పాటైన ఏ కమిటీలు ఇలా మీడియా ముందు ఫోజులివ్వలేదు. పనయిన తరువాత నివేదిక సమర్పించే ముందు చెప్పేవారు. ఇది కూడా ఒక ఎత్తుగడగానే చేసినట్లున్నారు. ఎందుకంటే ఆంధ్రులు ఆరంభశూరులని వీళ్ళకి బాగా చెప్పినట్టున్నారు తమిళ తంబి.
అలాగే రాజకీయ పార్టీలన్నీ ఇరు ప్రాంతాలుగా విడిపోయి తమ తమ అభిప్రాయాలను తెలియజేసాయి. ఈ ఎడబాటును అర్థం చేసుకుంటే చాలు. అలాగే ప్రధాన రాజకీయ పక్షాలైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల అధినాయకత్వం తమ అభిప్రాయాలను కమిటీకి సమర్పించలేదు. దీనిని కూడా పట్టించుకోలేదు. మరి ఇద్దరేసి నాయకులను ఆహ్వానించడమంటే మరల రెండు అభిప్రాయల మధ్య సఖ్యత ఎలా కుదురుతుంది. అలా కాకుండా ప్రతి పార్టీ అధ్యక్షుల అభిప్రాయాలనే తీసుకుంటామంటే ఆయా పార్టీల వైఖరి తేట తెల్లమవుతుంది. సమస్య అటో ఇటో తేలిపోతుంది. అది వదిలేసి ఈ రెండు నాల్కల ధోరణి వలన సమస్య మరింత జఠిలమవుతుందన్నది అక్షర సత్యం.
True…!!!
It’s Central govt trick..thay wanna put ‘T-ball’ in others court & start a new blame game
ఏ నాలుకను ఖండించాలో అర్థం కావడంలేదు వాళ్ళకు.
http://uselessnenusytham.blogspot.com/