మరో సామాన్య నిరాయుధుని బలి

ఈరోజు సంతోష్ నగర్ కూడలిలో గస్తీలో వున్న కానిస్టేబుళ్ళపై ఆగంతకులు కాల్పులు జరపగా అందులో రమేష్ అనే కానిస్టేబుల్ మరణించాడు. మరో యిద్దరు గాయాలపాలయ్యారు.

ఇది మన నిర్లిప్త రక్షక భట వ్యవస్థ యిచ్చిన బలిగానే పరిగణించాలి. పోలీసు గస్తీ పోస్టులలో వున్న వారిని నిరాయుధులుగా నిలబెట్టడం, అది కూడా పాతబస్తీ కూడళ్ళలో ఎంతవరకు సమంజసం? ఆ దగ్గర్లోనే మన సిద్ధం హీరో జగపతిబాబు డూప్ సి.పి. ఖాన్ గారు (గల్లీ పోలీసు క్రికెటర్) పర్యవేక్షిస్తున్నారంట మందీ మార్బలంతో. పాపం బిక్కు బిక్కుమంటూ 18 వ తారీఖు ఎప్పుడు గడుస్తుందా అని ఎదురుచూస్తున్న సామాన్య పోలీసులకు ప్రాణాలర్పించాల్సి రావడం విషాదకరం, విచారకరం, ఖండించాల్సిన విషయం. యిలా నిరాయుధులుగా నిలబెట్టిన వారిపై గతంలో కూడా దాడులు జరిగాయన్న ఇంగితజ్నానం లేకుండా వారి బలికోరడం వారి దౌర్భాగ్యం తప్ప మరోటి కాదు. బాసులు చుట్టూ ఆయుధధారులను వుంచుకొని గల్లీలో షికార్లు చేస్తూంటే పాపం రమేష్ బలయ్యాడు.

ఇది పిరికిపంద చర్యగా అంతా స్టేట్ మెంట్లతో సరిపిట్టేస్తారు రేపు. మరి కొద్ది గంటల్లో టీ.వీ.వాళ్ళుకూడా మరో కొత్త అంశం తో ఊదరగొడతారు. వికారుద్దీనో, జలాలుద్దీనో తాపీగా జారుకుంటాడు. ప్రతీకారంగానో, కేసు మూసేయడానికో సోడాబుడ్డీ అహ్మదో, దర్జీవాలా కబీరో కటకటాలు లెక్కిస్తాడో లేక ఎదురుకాల్పులలో మరణిస్తాడు!

శాంతి శాంతి శాంతి..

One thought on “మరో సామాన్య నిరాయుధుని బలి

  1. Pingback: Tweets that mention మరో సామాన్య నిరాయుధుని బలి « సామాన్యుడు * common man -- Topsy.com

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )